ఈ పళ్లు.. షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి!
చక్కెర వ్యాధిగ్రస్తులు కొన్ని పళ్లకు దూరంగా ఉండాలి. ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ ఫైబర్ ఉన్న పళ్లు వారికి కీడు చేస్తాయి.
మామిడి పళ్లలో ఎక్కువ మోతాదులో సుక్రోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు వీటి జోలికి వెళ్లకూడదు
వేసవిలో దొరికే పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
బాగా పండిన అరటి పండు కూడా హెచ్చు మోతాదులో గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటుంది.
పైనాపిల్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ద్రాక్ష పళ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. వీటిని చాలా తక్కువ మోతాదులో తినాలి.
చెర్రీ పళ్లలో కూడా షుగర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. వీటిని షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు.
ఎండు ద్రాక్షకు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండడం మంచిది.
ఆపిల్, బత్తాయి, నారింజ, పీర్స్, కివీ, బెర్రీస్ మొదలైన వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చు.
Related Web Stories
కరివేపాకు నమలడం వల్ల కలిగే 5 అద్భుత ప్రయోజనాలు!
కళ్లు పొడిబారడాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసా?
గర్భిణీలు జామకాయ తినాలా? వద్దా?
ఈ వ్యక్తులు పొరపాటున కూడా ఓట్స్ తినకూడదు!