వేరుశనగలు వీటిని  పల్లీలు అని పిలుస్తారు.

ఈ పల్లీల వల్ల కలిగే ప్రయోజనాలేంటో అందరికీ తెలిసే ఉంటుంది.

పల్లీలు చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.

వీటిని తిన్న వెంటనే నీళ్లు మాత్రం తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే అవి సరిగ్గా జీర్ణం కావు.

వేరుశెనగలు గట్టిగా ఉండటం వల్ల, అవి కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

పల్లీలు తిన్నవెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.

పల్లీలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది.

వెంటనే చల్లటి నీరు తాగితే, ఈ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది.

దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మారినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.