ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి.

కనీసం 20 నిమిషాల పాటు ప్లేట్ ముందు కూర్చుంటేనే మన కడుపు నిండినట్టు మెదడుకు సిగ్నల్ వెళ్తుంది.

భోజనం తర్వాత నిద్రపోవడం వల్ల మెటబాలిజమ్ తగ్గిపోతుంది.

ఫలితంగా శరీరంలో ఎక్కువ క్యాలరీలు చేరిపోతాయి.

రోజులో తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా ఎక్కువ ఆకలి వేస్తుంది.

కాబట్టి క్రమం తప్పకుండా నీళ్లు తాగుతుండాలి.

తినేటపుడు టీవీ లేదా మొబైల్ ఆఫ్ చేసెయ్యాలి.

వాటిని చూస్తూ తినడం వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువ తినేస్తుంటాం.