గొంతు నొప్పి ప్రతి ఒక్కరిని ఎప్పుడో అప్పుడు వేధిస్తుంటుంది. శీతాకాలం, వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఇంట్లో దొరికే పదార్థాలతో ఈ సమస్యను సులభంగా చెక్ పెట్టెవచ్చు.
ఫ్లూ లేదా ఇతర సమస్యలు గొంతునొప్పికి కారణమవుతాయి. యాసిడ్ రిఫ్లక్స్, కడుపుబ్బరం, విటమిన్స్ లోపం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం వల్ల గొంతు నొప్పికి కారణం కావచ్చు.
ఈ నొప్పిని నివారించడానికి తేనె దివ్య ఔషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒక చెంచా అల్లం రసంలో తేనె బాగా కలిపి తీసుకున్నట్లయితే ఈ గొంతు నొప్పి సమస్య నుంచి త్వరగా బయటవచ్చు. శ్వాసనాళాల్లో పేరుకుపోయిన శ్లేష్మం కూడా కరిగిపోతుంది.
గోరు వెచ్చని నీళ్లలో రాళ్ల ఉప్పు (రాక్ సాల్ట్) వేసి పుక్కిలించినా శ్లేష్మం కరిగిపోతుంది. ఈ నొప్పికి కారణమైన బ్యాక్టీరియాను అంతం చేస్తుంది.
త్వరగా ఉపశమనం సైతం లభిస్తుంది.
ఈ నొప్పితో బాధపడేవారు రోజూ రెండు కప్పుల చామంతి టీ తాగితే ప్రయోజనం ఉంటుంది. ఈ టీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
వేడి నీళ్లలో చామంతి ఆకులు వేసి.. ఆవిరి పీల్చినా గొంతు నొప్పి, జలుబు త్వరగా తగ్గుతాయి.
ఒక కప్పు నీటిలో 1 నుంచి 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని గంటకు ఒకసారి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది మోతాదు ప్రకారం తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే అనర్థాలకు దారి తీస్తుంది.
వెల్లుల్లి రెబ్బను నోట్లో పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు నములుతూ.. ఆ రసాన్ని మింగుతూ ఉంటే గొంతు నొప్పి తగ్గిపోతుంది. కప్పు నీటిలో అర చెంచా మిరియాల పొడి వేసి మరిగించిన నీటిలో కొద్దిగా బెల్లం వేసి వేడివేడిగా తాగినా గొంతు నొప్పి మాయమవుతుంది.