ఇది తాగితే ఎండల్లో తిరిగినా  వడదెబ్బ తగలదు..

సమ్మర్‌ వచ్చేసింది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం పండ్ల రసాల కన్నా రాగి జావ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు.

వేసవిలో రాగి జావ తాగితే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

వడదెబ్బ తగలకుండా ఉండటానికి, అలాగే శరీరాన్ని చల్లబరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది

ఉదయం పూట రాగి జావ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటీస్‌తో బాధ పడేవారు సైతం రాగి జావను ఎలాంటి సందేహం లేకుండా తాగవచ్చు. ఇది తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి.

రాగి జావ తాగడం వల్ల హుషారుగా శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. శరీరంలో ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి.