ఈ పండ్లు ఎక్కడ కనిపించినా  అస్సలు విడిచిపెట్టొద్దు..

సమ్మర్‌ వచ్చిందంటే చాలు పల్లె టూర్లలో చాలా మంది ఎంతో ఇష్టంగా ఈత పండ్లు తింటుంటారు.

ఈతపండ్లు తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కడుపును చల్లబరచడంలో ఈత పడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పండ్లు శరీరానికి చాలా చలువ,

వీటిని తినడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగడమే కాకుండా, ఇవి మలబద్ధకం, ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి

 పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా వీటిని తినడం వలన చాలా మేలు జరుగుతుంది.

బరువు నియంత్రణకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. శరీరానికి మేలు చేస్తాయి.

ఈత పండ్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది

 ఈతపండ్లను సమ్మర్‌లో ప్రతి రోజూ కాకుండా కనీసం వారంలో రెండు సార్లైనా తినడం వలన ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి.