మన దేశంలో బంగారంపై ఎంత సంపాదించారో తెలుసా..

ఇండియాలో బంగారాన్ని వారసత్వ సంపదగా భావిస్తారు

ఇండియాలో బంగారాన్ని వారసత్వ సంపదగా భావిస్తారు

బంగారం ధరలు పెరిగితే, అది ఉన్నవారి వారసత్వ సంపద కూడా పెరుగుతుంది

హెచ్‌ఎస్‌బీసీ నివేదిక ప్రకారం, దేశంలో బంగారపు నిల్వలు 25,000 టన్నులకు చేరుకున్నాయి

ఇది దేశంలోని కుటుంబాలకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు నిల్వ అని చూపిస్తుంది

గత ఏడాది, భారతీయులు బంగారంపై 750 బిలియన్ డాలర్ల (రూ. 64.17 లక్షల కోట్లు) సంపద పెంచుకున్నారు

భారత్‌లో ప్రైవేట్ బంగారం నిల్వలు ప్రపంచంలోని టాప్-10 సెంట్రల్ బ్యాంకుల స్థాయిని మించి ఉన్నాయి

2024 సెప్టెంబరులో 10 గ్రాముల బంగారం ధర రూ. 75,549 వద్ద ఉంది

2025 మార్చి నాటికి, 10 గ్రాముల బంగారం ధర రూ. 92,150కు చేరుకుంది

ధరల పెరుగుదలతో ఇండియన్స్ వద్ద ఉన్న 25,000 టన్నుల బంగారంపై రూ. 64 లక్షల కోట్ల సంపద పెరిగింది