సహజవనరులపై దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2022-06-25T05:47:16+05:30 IST
గ్రామాల్లో వ్యవసాయంలో సహజవనరులపై సర్పంచులు దృష్టిపెట్టాలని జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా సూచించారు.
జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా
గుంటూరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వ్యవసాయంలో సహజవనరులపై సర్పంచులు దృష్టిపెట్టాలని జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా సూచించారు. రైతుప్రాధికారిత సంస్థ ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై జడ్పీలో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్టినా మాట్లాడుతూ భూగర్భ జలవనరులను పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఖర్చులు తగ్గితేనే వ్యవసాయం లాభపాటిగా ఉంటుందన్నారు. సమావేశంలో రైతుసాధికారిత సంస్థ ప్రతినిదులు సహజ వ్యవసాయంలో అవసరమైన కషాయం, జీవామృతం తయారీపై శిక్షణ ఇచ్చారు. సీఈవో శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.