పోటీ చేస్తున్న అభ్యర్థులతో జెడ్సీ సమావేశం
ABN , First Publish Date - 2021-03-05T06:18:02+05:30 IST
జీవీఎంసీలో ఈనెల 10న జరగ నున్న ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని జోన్-5 ఎన్నికల అధికారి, జెడ్సీ పి.సింహాచలం విజ్ఞప్తి చేశారు.
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని విజ్ఞప్తి
జ్ఞానాపురం, మార్చి 4: జీవీఎంసీలో ఈనెల 10న జరగ నున్న ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని జోన్-5 ఎన్నికల అధికారి, జెడ్సీ పి.సింహాచలం విజ్ఞప్తి చేశారు. జోనల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం జోన్పరిధిలోని వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెడ్సీ ఎన్నికల వేళ అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు, పెట్టాల్సిన ఖర్చు గురించి వివరించారు. సమావేశంలో జోనల్ ప్రత్యేక అధికారి ప్రమీలా గాంధీ, 40 నుంచి 63 వార్డు లకు చెందిన ఆర్ఓలు, 134 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.