మూడో రోజూ జీరో పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2022-08-11T06:14:18+05:30 IST
జిల్లాలో బుధవారం కూడా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.
ఒంగోలు (కలెక్టరేట్), ఆగస్టు 10: జిల్లాలో బుధవారం కూడా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. గత మూడురోజులుగా జిల్లావ్యాప్తంగా కరోనా టెస్టులు చేస్తున్నా ఎక్కడా కేసులు వెలుగు చూడకపోవడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం 40 యాక్టివ్ కేసులు ఉండగా ఇద్దరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. 38మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.