ఇక ‘జీరో బేస్డ్ టైం టేబుల్... రైల్వేల్లో కొత్త ప్రయత్నం
ABN , First Publish Date - 2020-07-06T01:16:23+05:30 IST
భారతీయ రైల్వేల్లో మరో కీలక మలుపు చోటుచేసుకోనుంది. ఇప్పటికే ఓవైపు ప్రైవేటీకరణవేపు ప్రయాణిస్తోన్న రైల్వేలు... మరోవైపు కొత్త సంస్కరణలను చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... జోరో బేస్డ్ టైం టేబుల్ అందుబాటులోకి రానుంది. వాస్తవానికి దీనిని గతంలోనే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ... కరోనా నేపధ్యంలో ఇది వాయిదాపడింది.
న్యూఢిల్లీ : భారతీయ రైల్వేల్లో మరో కీలక మలుపు చోటుచేసుకోనుంది. ఇప్పటికే ఓవైపు ప్రైవేటీకరణవేపు ప్రయాణిస్తోన్న రైల్వేలు... మరోవైపు కొత్త సంస్కరణలను చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... జోరో బేస్డ్ టైం టేబుల్ అందుబాటులోకి రానుంది. వాస్తవానికి దీనిని గతంలోనే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ... కరోనా నేపధ్యంలో ఇది వాయిదాపడింది.
ప్రయాణాల్లో జాప్యాన్ని నివారించే యత్నాల్లో భాగంగా ప్రారంభించనున్న ఈ జీరో బేస్డ్ టైం టేబుల్ విధారం మెరుగైన ఫలితాలనిస్తుందని భావిస్తున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ప్రయాణికుల నుంచి కూడా ఈ విధానంపట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. కాగా... జీరో బేస్డ్ టైం టేబుల్ అమలవుతే... కొన్ని స్టేషన్లలో ఆయా సర్వీసులు ఆగవు.
అలాగే... ఎక్కే ప్రయాణికులు, దిగే ప్రయాణికులు లేనిపక్షంలో... ఆయా స్టేషన్లలొ కూడా రై్ళు నిలిపే సమయాన్ని మరింత కుదించనున్నారు. కాగా ఎక్స్ప్రెస్ సర్వీసులతోపాటు పాసింజర్ రైళ్ళకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు.