వైవీయూ సీఈని విధుల నుంచి తప్పించాలి

ABN , First Publish Date - 2021-04-16T04:41:40+05:30 IST

వైవీ యూనివర్సిటీలో కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామ్‌నర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ పద్మను సీఈ పదవి నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకు లు డిమాండ్‌ చేశారు.

వైవీయూ సీఈని విధుల నుంచి తప్పించాలి

రిజిస్ట్రార్‌కు విద్యార్థి సంఘాల జేఏసీ నేతల ఫిర్యాదు 

కడప వైవీయూ, ఏప్రిల్‌ 15: వైవీ యూనివర్సిటీలో కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామ్‌నర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ పద్మను సీఈ పదవి నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకు లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. జేఏసీ నాయకులు సుబ్బరాయుడు, శంకర్‌, వేణు, జయవర్ధన్‌ రిజిస్ట్రార్‌ దృష్టికి కం ట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై ఆ యన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైవీయూ సీఈలో పనికిరాని వస్తువులను, పేపర్లను సీఈ ప్రొఫెసర్‌ పద్మ పద్ధతి ప్రకారం వేలం వేయలేదని, ఆ మెకు ఇష్టం వచ్చినవారికి ఆమ్మేశారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా ఒక వస్తువును అమ్మాలంటే టెండర్‌ ద్వా రా నే విక్రయించాలన్నారు. టెండర్‌ లేకుండానే రూ.30 లక్షలు వి లువచేసే పేపర్లను అమ్మడం ఏమిటని రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాకుండా ప్రొఫెసర్‌ పద్మ కొన్ని డిగ్రీ కళాశాలలకు సెల్ఫ్‌సెంటర్లను కేటాయించి వారి దగ్గరి నుంచి డబ్బు లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-16T04:41:40+05:30 IST