యువత క్రీడల్లో రాణించాలి
ABN , First Publish Date - 2021-01-27T05:25:16+05:30 IST
యువత క్రీడల్లో రాణించాలి
తలకొండపల్లి: విద్యార్థులు,, యువత విద్యతో పా టు క్రీడల్లో రాణించాలని జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్, లయన్స్క్లబ్ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము లు కోరారు. పడకల్లో ఫ్రెండ్స్ యూ త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను మంగళవారం ప్రారంభించారు. క్రీడలు దేహ దారుఢ్యానికి, మానసిక వికాసానికి దోహదపడుతాయన్నారు కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ రమేశ్,నిర్వాహకులు శ్రీశైలం, సుమన్రెడ్డి, గణేశ్, శ్రీను, మహేశ్, హరీశ్, ప్రకాశ్రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు.