మీ అధికారానికి పాతరేసేది రైతులే: Sharmila
ABN , First Publish Date - 2021-12-16T18:28:16+05:30 IST
బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...పంట పాడైతే నష్టపరిహారం అందించే దిక్కులేదన్నారు. రైతు చావులను సర్కార్ సర్కస్లా చూస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ను నమ్మలేక లేక.. పురుగుల మందునే నమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొంటున్నారన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి అంటూ వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యల పాపం నాది కాదని కేసీఆర్ పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారన్నారు. ‘‘రైతుల చావులకు కారణమైన మీ పాపం ఊరికే పోదు... రైతు హంతకులు మీరు. రైతును కాటికి పంపుతున్న మీ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది మీ అధికారానికి పాతరేసేది రైతులే’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.