వైఎస్ Viveka murder case.. గంగాధర్ రెడ్డి మృతిపై కేసు నమోదు..

ABN , First Publish Date - 2022-06-09T21:00:43+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులపై ఆరోపణలు చేసిన కల్లూరు గంగాధర్ రెడ్డి మృతిపై...

వైఎస్ Viveka murder case.. గంగాధర్ రెడ్డి మృతిపై కేసు నమోదు..

Anantapuram: వైఎస్ వివేకా హత్య కేసు (Viveka murder case)లో సీబీఐ అధికారులపై ఆరోపణలు చేసిన కల్లూరు గంగాధర్ రెడ్డి (Gangadhar Reddy) మృతిపై CRPC 174 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గంగాధర్ రెడ్డి మృతికి కారణాలు తెలియరాలేదు... DEATH CAUSE NOT KNOWN అనే కోణంలో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం పోలీసులు వివరాలు వెల్లడించనున్నారు.


వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారంటూ గంగాధర్ రెడ్డి గత ఏడాది నవంబర్ నెలలో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో పూర్తిస్థాయిలో పోలీసులు రక్షణ కల్పించారు. గంగాధర్ రెడ్డి కదలికలపై నిరంతరం నిఘా పెట్టారు. యాడికిలోని ఇంటి సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు  చేశారు. కాగా గురువారం తెల్లవారుజామున గంగాధర్ రెడ్డి మృతిచెందాడు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని తాడిపత్రికి తరలించారు.  పోస్టుమార్టం అనంతరం గంగాధర్ రెడ్డి మృతికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-06-09T21:00:43+05:30 IST