యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దు: సీఐ

ABN , First Publish Date - 2022-10-22T05:17:09+05:30 IST

యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దు: సీఐ

యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దు: సీఐ
సమావేశంలో మాట్లాడుతున్న సీఐ శ్రీధర్‌కుమార్‌

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 21 : యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని సీఐ శ్రీధర్‌కుమార్‌ సూచించారు. మండలంలోని వర్ధమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో శుక్రవారం యాంటి డ్రగ్‌ అండ్‌ సైబర్‌ క్రైంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ శ్రీధర్‌కుమార్‌ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌ బారిన పడి జీతాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్ధులను డ్రగ్స్‌ మాఫియా టార్గెట్‌ చేస్తోందన్నారు. ఎవరైనా డ్రగ్స్‌ అమ్మినా, కొన్నా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. విద్యార్ధులు అప్రమత్తంగా ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-22T05:17:09+05:30 IST