యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి సన్మానం
ABN , First Publish Date - 2020-12-06T04:43:40+05:30 IST
యువజనకాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కోట్ల రవీందర్ రెడ్డిని శనివారం డీసీసీ అధ్యక్షుడు కుంభం శివ కుమార్రెడ్డి శాలువాతో సన్మానించి అభినందిం చారు.
నారాయణపేట, డిసెంబరు 5 : యువజనకాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కోట్ల రవీందర్ రెడ్డిని శనివారం డీసీసీ అధ్యక్షుడు కుంభం శివ కుమార్రెడ్డి శాలువాతో సన్మానించి అభినందిం చారు. యువతే పార్టీకి కీలకమన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో యువత పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించాలని, పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ కోఆప్షన్ ఎండీ గౌస్, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి వేనుగోపాల్, మాజీ ఎంపీపీ శివారెడ్డి, కౌన్సిలర్ సలీం, శ్రీనివాస్, శరణ్ నాయక్, శరణప్ప, లిఖి, జలీల్ బేగ్, భీం ప్రకాష్ పాల్గొన్నారు.