HARYANA: భార్యతో మూడ్రోజులుగా గొడవ.. చివరకు ఆ భర్త ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-08-16T21:46:00+05:30 IST

ఆ భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. మూడ్రోజులుగా వారిద్దరూ ఏదో విషయమై గొడవ పడుతున్నారు

HARYANA: భార్యతో మూడ్రోజులుగా గొడవ.. చివరకు ఆ భర్త ఎంత పని చేశాడంటే..

ఆ భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. మూడ్రోజులుగా వారిద్దరూ ఏదో విషయమై గొడవ పడుతున్నారు.. సోమవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని తలుపు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూసి షాకయ్యాడు.. లోపల మహిళ రక్తపు మడుగులో పడి ఉంది.. వేరే గదిలో ఆమె భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.. దీంతో ఆ ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 


ఇది కూడా చదవండి..

Shocking: పాముపై ప్రతీకారం తీర్చుకున్న రెండేళ్ల బాలిక.. తనను కాటేసిన పామును పట్టుకుని నోటితో..


హర్యానా (Haryana)లోని బాడీ గ్రామానికి చెందిన దేవేంద్ర (27) అనే వ్యక్తి, భార్య సునీత (24)తో కలిసి సోనిపట్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మూడేళ్లుగా వీరిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత మూడ్రోజులుగా వీరిద్దరూ ఏదో విషయమై తీవ్రంగా గొడవపడుతున్నారు. పక్కింట్లోనే ఉండే యజమాని వారి గొడవను విన్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ దేవేంద్ర, సునీత బయటకు రాలేదు. అనుమానం వచ్చిన ఇంటి యజమాని తలుపు తట్టాడు. అయినా లోపలి నుంచి స్పందన లేదు. 


పక్కింటి వారి సహాయంతో తలుపు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూసి షాకయ్యాడు. సునీత రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె గొంతు కోసి ఉంది. మరో గదిలో దేవేంద్ర ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఆ ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. భార్యను హత్య చేసిన తర్వాత దేవేంద్ర ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-08-16T21:46:00+05:30 IST