మీ పోరాటం రాష్ట్రాభివృద్ధి కోసం కాదు: ఎంపీ గల్లా
ABN , First Publish Date - 2020-09-19T09:52:10+05:30 IST
మీ పోరాటం రాష్టాభివృద్ధి కోసం కాదు.. రాజకీయ ప్రయోజనాల కోసమే.. అంటూ వైసీపీ ఎంపీల తీరును ఎంపీ గల్లా జయదేవ్ తప్పు పట్టారు. ఈ మేరకు
గుంటూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మీ పోరాటం రాష్టాభివృద్ధి కోసం కాదు.. రాజకీయ ప్రయోజనాల కోసమే.. అంటూ వైసీపీ ఎంపీల తీరును ఎంపీ గల్లా జయదేవ్ తప్పు పట్టారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడినప్పుడల్లా వారు బయటకు వచ్చి న్యాయమూర్తులపై మాటల దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కూడా న్యాయమూర్తులను విమర్శిస్తూ ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
16 నెలల్లో సుప్రీం, హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 107 తీర్పులొచ్చాయని గుర్తు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన ఆంశాలను నెరవే ర్చాలని కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని వైసీపీ ఎంపీలను ప్రశ్నించారు.
కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు కోసం ఎందుకు డిమాండ్ చేయరని నిలదీశారు. ఇవన్నీ వదిలేసి పార్లమెంట్ ఆవరణలోని గాంఽఽధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేయటం సిగ్గుచేటని జయదేవ్ అన్నారు.