అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-11-28T05:16:18+05:30 IST
ఆత్మకూరు మండలం సంజీవనగర్తండాలోని పంటకాల్వలో నాగరాజు(18) అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతిచెందాడు.
ఆత్మకూరు, నవంబరు 27: ఆత్మకూరు మండలం సంజీవనగర్తండాలోని పంటకాల్వలో నాగరాజు(18) అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతిచెందాడు. ప్రకాశం జిల్లా పెద్దమంతనాల గ్రామానికి చెందిన చిన్న వెంకటమ్మ కుమారుడు నాగరాజు గురువారం తన స్నేహితులతో కలిసి ఆత్మకూరుకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందోకాని సంజీవనగర్తండా ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న పంటకాల్వలో పడి మృతిచెందినట్లు శుక్రవారం ఉదయం గ్రామస్థులు కనుగొన్నారు. ఆత్మకూరు ఎస్సై నాగేంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడు నాగరాజు మద్యం సేవించినట్లు గుర్తించామని ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.