తీవ్ర ఒత్తిడికి లోనై యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-10-01T12:01:20+05:30 IST

ఆరోగ్య పరిస్థితులు బాగాలేక తీవ్ర ఒత్తిడికి లోనైన ఓ యువకుడు ఉరేసుకుని

తీవ్ర ఒత్తిడికి లోనై యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్/బోయినపల్లి: ఆరోగ్య పరిస్థితులు బాగాలేక తీవ్ర ఒత్తిడికి లోనైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్‌పల్లి పోలీ‌స్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం జాన్సీకి చెందిన విజయ్‌సింగ్‌(25) రెండు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి మార్బుల్‌ పాలిషింగ్‌ పనులు చేసుకుంటూ బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద ఉన్న నందమూరినగర్‌ బస్తీలో నివాసముంటున్నాడు. విజయ్‌సింగ్‌తో పాటు రూమ్‌లో ఉండే మరో ఇద్దరు యువకులు ఈ నెల 29న పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగొచ్చారు.


ఎంత తట్టినా విజయ్‌సింగ్‌ తలుపులు తీయలేదు. స్నేహితులు స్థానికుల సహాయంతో తలుపులను బద్దలుకొట్టి చూసేసరికి వెంటిలేటర్‌ కిటికీకి తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-01T12:01:20+05:30 IST