మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-19T05:05:04+05:30 IST
మండల పరిఽధిలోని లక్ష్మీపాళెం గ్రామానికి చెందిన సుజాత(19) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
బద్వేలు రూరల్, అక్టోబరు 18: మండల పరిఽధిలోని లక్ష్మీపాళెం గ్రామానికి చెందిన సుజాత(19) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల వివరాల మేరకు... సుజాత తండ్రి తాగుడుకు బానిసై ఇరుగుపొరుగు వారితో నిత్యం గొడవలు పడుతూ ఉండేవాడు. దీంతో సుజాత మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ తెలియక పోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రామ సమీపంలో ఉన్న బావిలో సుజాత శవమై కనిపించింది. గ్రామస్తులు గమనించి మృతదేహాన్ని వెలికి తీశారు. సుజాత మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.