యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-15T05:15:50+05:30 IST
మంగల వీధి రాగుల రాధిక(19) ఆత్మహత్యకు పాల్పడినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. రాధిక ఇంటర్ చదివి డిగ్రీ కళాశాల చేరాలనుకుండేదని తెలిపారు.
కడప(క్రైం), ఆగస్టు 14: మంగల వీధి రాగుల రాధిక(19) ఆత్మహత్యకు పాల్పడినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. రాధిక ఇంటర్ చదివి డిగ్రీ కళాశాల చేరాలనుకుండేదని తెలిపారు. కొద్ది నెలలుగా కడుపునొప్పితో బాధపడుతుందని ఆదివారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్కు తరలించినట్లు తెలిపారు.