కాంక్రీట్ మిల్లర్లో పడి యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2020-02-20T08:30:59+05:30 IST
మండలంలోని వెల్లంకి గ్రామంలో ఉన్న ఎన్సీఎల్ ఇండస్ట్రియల్ కంపెనీకి చెందిన మిల్లర్లో పడి యువకుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వెల్లంకి గ్రామంలోని ఎన్సీఎల్ ఇండస్ట్రియల్
ఆనందపురం, ఫిబ్రవరి 19 : మండలంలోని వెల్లంకి గ్రామంలో ఉన్న ఎన్సీఎల్ ఇండస్ట్రియల్ కంపెనీకి చెందిన మిల్లర్లో పడి యువకుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వెల్లంకి గ్రామంలోని ఎన్సీఎల్ ఇండస్ట్రియల్ మిల్లులో ఒడిశాకు చెందిన బషన్కుమార్ సమంత్రావ్ (22) పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం కాంక్రీట్ అన్లోడ్ చేసిన అనంతరం మిల్లర్ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ అందులో జారిపడ్డాడు. మిల్లర్ చక్రాల మధ్య నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ గణేస్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.