రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ABN , First Publish Date - 2021-03-04T05:20:14+05:30 IST
గుజ్జంగివలస సమీపంలో బుధ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్ము గ్రామానికి చెందిన సువ్వాడ సూరిబాబు (29) దుర్మరణం చెందాడు. దీంతో స్వ గ్రామంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి.
గుర్ల, మార్చి 3 : గుజ్జంగివలస సమీపంలో బుధ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్ము గ్రామానికి చెందిన సువ్వాడ సూరిబాబు (29) దుర్మరణం చెందాడు. దీంతో స్వ గ్రామంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల నిమిత్తం జమ్ము నుంచి ఉదయాన్నే బైక్పై గరివిడి వెళ్లిన సూరిబాబు తిరిగి ఇంటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 ద్వారా ఆయన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూరిబాబు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మరో రెండు నెలల్లో పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రులు తవిటినాయుడు, ఆదిలక్ష్మి బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు ...
రామభద్రపురం : ఎస్.సీతారాంపురం గ్రామ సమీపాన జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... అదే గ్రామానికి చెందిన తాడ్డి ప్రసాద్(30) ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్కి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.