ప్రాజెక్టు పనుల్లో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-25T04:05:33+05:30 IST

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో శనివారం అ పశ్రుతి చోటు చేసుకుంది.

ప్రాజెక్టు పనుల్లో యువకుడి మృతి

కొల్లాపూర్‌, జూలై 24: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. మండల పరిధిలోని కుడికిళ్ల గ్రామ శివారులో పాలమూ రు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువ పనుల వద్ద టిప్పర్‌ టైర్‌ను జాకీతో రిపేర్‌ చేస్తుండగా ఒక్కసారి జాకీ పట్టు తప్పిపోవడంతో టిప్పర్‌ కుప్పకూలింది. దీంతో టిప్పర్‌ కింద ఉన్న శంకర్‌(21)అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్‌ పక్కన ఉన్న దిలీప్‌(45), శ్రీను(25)లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడా శంకర్‌ మృతి చెందినట్లు వైద్యులు ని ర్ధారించారు. మృతుడు పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేట వాసిగా గుర్తించారు. మృ తుని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రాజెక్టు పనుల వద్ద మృతుని బంధు వులు ఆందోళనకు దిగారు. 



Updated Date - 2021-07-25T04:05:33+05:30 IST