బైక్‌ ఢీ యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-14T05:30:00+05:30 IST

మండల కేంద్రంలోని బైపాస్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బజార్‌ కొత్తూర్‌ గ్రామానికి చెందిన మౌని సాగర్‌ (32) అక్కడికక్కడే మృతి చెందాడు.

బైక్‌ ఢీ యువకుడి మృతి

నందిపేట, మే14: మండల కేంద్రంలోని బైపాస్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బజార్‌ కొత్తూర్‌ గ్రామానికి చెందిన మౌని సాగర్‌ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బజార్‌ కొత్తూర్‌ గ్రామానికి చెందిన మౌనిసాగర్‌ బైక్‌పై బైపాస్‌రోడ్డు మీదుగా బజార్‌కొత్తూర్‌ గ్రామం వైపు వెళ్తున్నారు. అదే సమయంలో (ఏపీ26ఏసీ5076)నెంబర్‌ గల కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలైన మౌనిసాగర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు   


Updated Date - 2021-05-14T05:30:00+05:30 IST