హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్న యువకుడు.. సాయంత్రం 7 గంటలకు తలుపు తట్టిన సిబ్బంది.. అనంతరం గదిలోని దృశ్యం చూసి..

ABN , First Publish Date - 2022-04-15T13:11:05+05:30 IST

మధ్యాహ్నం 2 గంటల సమయంలో హోటల్‌లో అతడు రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అనంతరం రూమ్‌లోకి వెళ్లి, తలుపులను లోపల నుంచి లాక్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సాయంత్రం వేళ హోటల్ సిబ్బంది అతడి గది వద్దకు వెళ్లారు. రూమ్‌లో ఉన్న

హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్న యువకుడు.. సాయంత్రం 7 గంటలకు తలుపు తట్టిన సిబ్బంది.. అనంతరం గదిలోని దృశ్యం చూసి..

ఇంటర్నెట్ డెస్క్: మధ్యాహ్నం 2 గంటల సమయంలో హోటల్‌లో అతడు రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అనంతరం రూమ్‌లోకి వెళ్లి, తలుపులను లోపల నుంచి లాక్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సాయంత్రం వేళ హోటల్ సిబ్బంది అతడి గది వద్దకు వెళ్లారు. రూమ్‌లో ఉన్న కూలర్‌లో నీళ్లు పోసేందుకని రూమ్ తలుపు తట్టారు. అనంతరం గదిలోపలి దృశ్యాలను చూసి షాకయ్యారు. వెంటనే పోలీసుకుల సమాచారం అందించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


సుమారు పాతికేళ్ల వయసున్న యువకుడు.. రాజస్థాన్‌లోని జుంజూ నగరంలో ఉన్న ఓ హోటల్‌కు గురువారం మధ్యాహ్నం వెళ్లాడు. తనకు ఓ రూమ్ అద్దెకు కావాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అతడి వద్ద డబ్బులు తీసుకున్న హోటల్ మేనేజ్‌మెంట్.. ఆ యువకుడికి రూమ్ అలాట్ చేశారు. దీంతో అతడు తన గదికి వెళ్లిపోయాడు. కూలర్‌లో నీళ్లు పోసేందుకని హోటల్ సిబ్బంది సాయంత్రం 7 గంటలకు అతడి రూమ్ వద్దకు వెళ్లారు. తలుపు తట్టి డోర్ తీయాల్సిందిగా కోరారు. అయితే లోపల నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. 



తమ వద్ద ఉన్న మరో తాళం చెవితో గది తలుపుతు తెరిచారు. ఈ క్రమంలో అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. ఆ యువకుడు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ యువకుడు హోటల్‌లో ఇచ్చిన ఐడీ కార్డు ఆధారంగా అతడు ఎవరు? ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-04-15T13:11:05+05:30 IST