విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-11-30T06:58:27+05:30 IST
విద్యుదాఘాతంతో యువ కుడు మృతి చెందాడు.
తుంగతుర్తి నవంబరు 29: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. మండలంలో వెంపటి గ్రామానికి చెందిన రెక్కల సురేష్(26) విద్యుత్ లైన్మన్ కింద సహాయకుడిగా కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా దేవునిగుట్ట తండాలో విద్యుత్ లైన్ను సరిచేయడానికి సోమవారం స్తంభం ఎక్కాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో స్తంభం నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సురేష్కు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. భార్య ప్రస్తుతం గర్భిణి కావడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సురేష్ మృతి చెం దాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.