రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-10-19T04:31:38+05:30 IST

కుప్పం-వి.కోట ప్రధానరహదారిలో గంధారమాకులపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన శివకుమార్‌ కుమారుడు సాయికుమార్‌ (24) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సాయికుమార్‌(ఫైల్‌ ఫొటో)

వి.కోట, అక్టోబరు18: కుప్పం-వి.కోట ప్రధానరహదారిలో గంధారమాకులపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన శివకుమార్‌ కుమారుడు సాయికుమార్‌ (24) మృతి చెందాడు. ఆదివారం కర్ణాటక ప్రాంతం నుంచి ఓ ఆటో వి.కోటకు వస్తూ గంధారమాకులపల్లె సమీపంలో ప్రమాదవశాత్తూ కారును ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సాయికుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  బేతమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-19T04:31:38+05:30 IST