రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-19T04:31:38+05:30 IST
కుప్పం-వి.కోట ప్రధానరహదారిలో గంధారమాకులపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేడ్కర్ నగర్కు చెందిన శివకుమార్ కుమారుడు సాయికుమార్ (24) మృతి చెందాడు.
వి.కోట, అక్టోబరు18: కుప్పం-వి.కోట ప్రధానరహదారిలో గంధారమాకులపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేడ్కర్ నగర్కు చెందిన శివకుమార్ కుమారుడు సాయికుమార్ (24) మృతి చెందాడు. ఆదివారం కర్ణాటక ప్రాంతం నుంచి ఓ ఆటో వి.కోటకు వస్తూ గంధారమాకులపల్లె సమీపంలో ప్రమాదవశాత్తూ కారును ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సాయికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బేతమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.