ప్రాణం తీసిన అతివేగం.. బైక్ను ఢీకొన్న లారీ.. యువతి మృతి
ABN , First Publish Date - 2022-05-17T14:07:34+05:30 IST
ప్రాణం తీసిన అతివేగం.. బైక్ను ఢీకొన్న లారీ.. యువతి మృతి
హైదరాబాద్ సిటీ/కూకట్పల్లి : అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో (Road Accident) ఓ యువతి మృతి చెందింది. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన కూకట్పల్లిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. సంగారెడ్డిలోని వీరభద్రనగర్కు చెందిన పిచ్చరాగడి శేఖర్, శోభ దంపతుల పెద్ద కుమార్త శివాణి(21) దిల్సుఖ్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటోంది. ఆదివారం రాత్రి (Night) తన స్నేహితుడైన మహేష్తో బైక్ (TS03 EX1273)పై కూకట్పల్లికి వచ్చింది.
అర్ధరాత్రి దాటాక తిరిగి హాస్టల్కు వెళ్లేందుకు ఇద్దరు బైక్పై బయలుదేరారు. జేఎన్టీయూ నుంచి కూకట్పల్లివైపు వెళ్తుండగా, ఉషాముళ్లపూడి రోడ్డు సమీపంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ(ఎంహెచ్13ఏఎక్స్4930) వీరి బైక్ను పక్క నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. తల, చేతులకు తీవ్రగాయాలైన శివాణిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. అపస్మారక స్థితిలో ఉన్న మహేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకొని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.