గోదావరిలో దూకి యువకుడి గల్లంతు
ABN , First Publish Date - 2020-12-05T06:28:49+05:30 IST
మలికిపురం, డిసెంబరు 4: అనారోగ్యంతో బాధపడుతున్న ఒక యువకుడు గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. మలికిపురానికి చెందిన రుద్ర పవన్కుమార్ (21)
మలికిపురం, డిసెంబరు 4: అనారోగ్యంతో బాధపడుతున్న ఒక యువకుడు గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. మలికిపురానికి చెందిన రుద్ర పవన్కుమార్ (21) డిప్లమో పూర్తిచేశాడు. మలికిపురంలో ఒక ఫైనాన్స్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్న పవన్ వెన్నుపూత సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు పవన్కుమార్ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, చించినాడ-దిండి వంతెన వద్ద చెప్పులు ఉన్నాయని తండ్రి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కోసం నదిలో జాలర్లు గాలిస్తున్నారని ఎస్ఐ ఎం.నాగరాజు తెలిపారు.