తమిళనాడు పోలీసుల అదుపులో యోగ్యతాశ్రమం నిర్వాహకుడు

ABN , First Publish Date - 2020-08-09T11:46:11+05:30 IST

నాగలాపురం మండలం రాజులకండ్రిగలోని యోగ్యతాశ్రమం నిర్వాహకుడు ప్రభును తమిళనాడు పోలీసులు శనివారం అదుపులో తీసుకున్నారు.

తమిళనాడు పోలీసుల అదుపులో యోగ్యతాశ్రమం నిర్వాహకుడు

నాగలాపురం, ఆగస్టు 8: నాగలాపురం మండలం రాజులకండ్రిగలోని యోగ్యతాశ్రమం నిర్వాహకుడు ప్రభును తమిళనాడు పోలీసులు శనివారం అదుపులో తీసుకున్నారు. చెన్నై ఆవడికి చెందిన శ్రీనివాస్‌, తిరుమలవాయల్‌కు చెందిన వర్ష అనే యువతి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుమలవాయల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజులకండ్రిగలోని ఆశ్రమంలో వారిద్దరి ఫోన్‌ సిగ్నల్స్‌ ట్రేస్‌అవుట్‌ కావడంతో పోలీసులతో పాటు యువతి తల్లితండ్రులు ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వారిద్దరి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రభును అదుపులో తీసుకుని విచారణ నిమిత్తం చెన్నైకు తీసుకెళ్లారు. అయితే ఆశ్రమానికి అలాంటి వారు ఎవరూ రాలేదని ఆశ్రమ నిర్వాహకుడు(గురూజీ) చెబుతుండగా... గురూజీ ఆశీస్సులతో తాము త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తమ కుమార్తె తమకు ఫోన్‌ చేసి చెప్పిందని యువతి తల్లి తండ్రులు పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2020-08-09T11:46:11+05:30 IST