టీడీపీ నాయకుడిపై వైసీపీ శ్రేణుల దాడి

ABN , First Publish Date - 2021-04-11T06:16:20+05:30 IST

టీడీపీ నాయకుడిపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడికి దిగడంతో అతని కారు అద్దం ధ్వంసమైంది.

టీడీపీ నాయకుడిపై వైసీపీ శ్రేణుల దాడి
వైసీపీ కార్యకర్తల దాడిలో పగిలిన టీడీపీ నాయకుడి కారు అద్దాలు


 పగిలిన కారు అద్దాలు

 పోలీసులకు ఫిర్యాదు చేసిన గెడ్డం నానాజీ

టీడీపీ నాయకుడు కారు ఢీకొనడంతో ఒకరికి గాయమైనట్టు ప్రత్యర్థుల ఫిర్యాదు


 గొలుగొండ, ఏప్రిల్‌ 10 : టీడీపీ నాయకుడిపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడికి దిగడంతో అతని కారు అద్దం ధ్వంసమైంది. దీంతో గ్రామంలో పరిస్థితులు తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి,  ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఇరువర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలివి. గొలుగొండ మండలం పాతమల్లంపేటకు చెందిన టీడీపీ నాయకుడు గెడ్డం నానాజీ శనివారం గొలుగొండ నుంచి పాతమల్లంపేటకు కారులో వస్తున్నారు. ద్వారకానగరంలో వైసీపీ నాయకుడు లెక్కల సత్యనారాయణ ఇంటి వద్ద గల రోడ్డులో వైసీపీకి చెందిన ఐదురుగురు కార్యకర్తలు తనపై దాడికి దిగగా, తన కారు అద్దం పగిలినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే,  ద్వారకానగరంలో టీడీపీ నాయకుడు తన కారుతో లెక్కల నానాజీని ఢీకొట్టడంతో కాలుకు స్వల్ప గాయాలయ్యాయని వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్షతగాత్రుడ్ని గొలుగొండ పీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులపై విచారణ జరిపి, కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ ధనుంజయనాయుడు చెప్పారు. 


Updated Date - 2021-04-11T06:16:20+05:30 IST