వైసీపీ జెండాలతో అంబ్కేర్ విగ్రహాన్ని కప్పేశారు!
ABN , First Publish Date - 2021-07-25T02:52:05+05:30 IST
కావలిలో శనివారం ముగ్గురు రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సోహంతో వైసీపీ జెండాలతో కూడిన తోరణాలను ట్రంకురోడ్డులోని అంబేద్కర్ విగ్రహాన్ని నిలువునా కప్పేశారు.
మున్సిపల్ కమిషనర్కు దళిత సంఘాల ఫిర్యాదు
కావలిటౌన్, జూలై 24: కావలిలో శనివారం ముగ్గురు రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సోహంతో వైసీపీ జెండాలతో కూడిన తోరణాలను ట్రంకురోడ్డులోని అంబేద్కర్ విగ్రహాన్ని నిలువునా కప్పేశారు. దీంతో దళిత సంఘాలు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పార్టీ తోరణాలు, జెండాలు కట్టరాదన్న నిబంధనను ఉల్లంఘించడమే కాక ఆయన మొహం కూడా కనిపించకుండా తోరణాలు కట్టడం అప్రజాస్యామ్యమని, అంబేద్కర్ను అవమానపచడమేనని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.