వైసీపీకి గుణపాఠం తప్పదు!
ABN , First Publish Date - 2022-08-17T05:09:11+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధా నాలపై ప్రజలు గుణపాఠం చెబుతారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారా ణి పిలుపునిచ్చారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి
చెరుకూరు(పర్చూరు), అగస్టు 16: వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధా నాలపై ప్రజలు గుణపాఠం చెబుతారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారా ణి పిలుపునిచ్చారు. మండలంలోని చెరుకూరు గ్రామంలో మంగళవారం ఆ పా ర్టీ మండల అధ్యక్షుడు షేక్షంషుద్దీన్ నేతృత్వంలో బాదుడే బాదుడు కార్యక్ర మం నిర్వహించారు. తొలుత స్థానిక ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉషారాణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ పథ కాల పేరుతో ప్రజలను మభ్య పెట్టి ప్రజలపై అదనపు భారంమోపి ఆర్థికంగా కుంగతీస్తున్నారన్నారు. ప్రజలు సంఘటితంగా పోరాడి రాబోయే ఎన్నికల్లో వైసీ పీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు షేక్ జమాలుద్దీన్, కొరిటాల సురేష్, కాపు రవిచంద్ర, మామిడిపాక హరిప్రసాద్, దాసరి రామకృష్ణ, పాలేరు కోటేశ్వరరావు, కొండ్రగంటి శివనాగేశ్వర రావు, శ్రీరాం వెంకట సుబ్బారావు, గిరిబాబు, షేక్ హుస్సేన్, రామచంద్రయ్య, జానీ, హస్సేన్, గోరంట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.