వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి

ABN , First Publish Date - 2022-05-21T06:36:07+05:30 IST

మూడు సంవత్సరాలుగా పన్నుల భారం మోపి ఇబ్బందులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలపుపునిచ్చారు.

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి
బాదుడే బాదుడు కార్యక్రమంలో మాట్లాడుతున్న టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

టీడీపీ ‘విశాఖ’ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, మే 20: మూడు సంవత్సరాలుగా పన్నుల భారం మోపి ఇబ్బందులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలపుపునిచ్చారు. జీవీఎంసీ 73వ వార్డు వంటిళ్లు జంక్షన్‌లో శుక్రవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడప గడపకు వస్తున్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. ప్రజలను పీడించే అసమర్థ పాలన ఇదేవిధంగా కొనసాగితే రాష్ట్రంలో శ్రీలంక వంటి పరిస్థితులు వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ రఫీ, నాయకులు గొలగాని రమణ, బలగ బాలునాయుడు, నమ్మి సింహాద్రి, వియ్యపు కొండబాబు, పెరుమాళ్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-21T06:36:07+05:30 IST