టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
ABN , First Publish Date - 2022-01-17T05:19:19+05:30 IST
మండలంలోని ఉలిందకొండ టీడీపీ నాయకులు ఈవీ రమణ, సుబ్బారెడ్డి, ఖరీం ఆధ్వర్యంలో 30 బీసీ కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
కల్లూరు, జనవరి 16: మండలంలోని ఉలిందకొండ టీడీపీ నాయకులు ఈవీ రమణ, సుబ్బారెడ్డి, ఖరీం ఆధ్వర్యంలో 30 బీసీ కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆదివారం మాధవీనగర్లోని గౌరు నివాసంలో ఉలిందకొండకు చెందిన శేషు యాదవ్, శ్రీనివాసులు, మహేంద్ర, జగదీష్, రామదాసు, సురేంద్ర, అశోక్, మధు, సురేష్, మాసూంబాషాకు పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు విరక్తి చెంది తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. గౌరు దంపతులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు పట్లుదలతో కృషి టీడీపీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.