వైసీపీలో నాయకుల ఏకపక్ష తీరుపై వైవీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-01-16T05:07:28+05:30 IST

సింగరాయకొండ మండలంలోని వైసీపీ ప్రధాన నాయకుల తీరుపై అసమ్మతి వర్గం గురువారం టీటీడీ దేవస్థాన చైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డిని కలసి ఫిర్యాదు చేశారు.

వైసీపీలో నాయకుల ఏకపక్ష తీరుపై వైవీకి ఫిర్యాదు
వైవీకి ఫిర్యాదు చేస్తున్న వైసీపీ నేతలు

సింగరాయకొండ, జనవరి 15 : మండలంలోని వైసీపీ ప్రధాన నాయకుల తీరుపై అసమ్మతి వర్గం గురువారం టీటీడీ దేవస్థాన చైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డిని కలసి ఫిర్యాదు చేశారు.  అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బింగినపల్లెకు చెందిన ఓ నాయకుడి తీరును ప్రధానంగా వివరించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై వైవీ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జి మాదాసి వెంకయ్య, ఒంగోలు పార్లమెంట్‌ వైద్య విభాగం అఽధ్యక్షుడు బత్తుల అశోక్‌కుమార్‌ వ్యవహార శైలిని కూడా వివరించారు. అనంతరం వై.వి మాట్లాడుతూ త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితులను చక్కబెడతామన్నారు. వైవీని కలసిన వారిలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు చలంచర్ల కోటేశ్వరరావు, ఊళ్లపాలెం మాజీ సర్పంచ్‌ పీవీ రెడ్డి, సింగరాయకొండ మాజీ సర్పంచ్‌ పామర్తి మాధవ, కలికివాయి సీనియర్‌ నాయకుడు నాగేశ్వరరెడ్డి, పాతసింగరాయకొండ సీనియర్‌ నాయకుడు కొట్టే జాలయ్య, గూడిపాటి రవి, అంకమరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.


Updated Date - 2021-01-16T05:07:28+05:30 IST