మహిళల పట్ల వైసీపీ నేతల తీరు గర్హనీయం

ABN , First Publish Date - 2022-06-29T06:09:42+05:30 IST

రాష్ట్రంలో మహిళల పట్ల వైసీపీ నేతల వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని తెలుగుమహిళ కుప్పం నియోజకవర్గ నేతలు అనసూయ, చంద్రకళ, సుగుణమ్మ పేర్కొన్నారు.

మహిళల పట్ల వైసీపీ నేతల తీరు గర్హనీయం
శాంతిపురంలో మీడియాతో తెలుగు మహిళా నేతలు

శాంతిపురం, జూన్‌ 28: రాష్ట్రంలో మహిళల పట్ల  వైసీపీ నేతల వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని తెలుగుమహిళ కుప్పం నియోజకవర్గ నేతలు అనసూయ, చంద్రకళ, సుగుణమ్మ పేర్కొన్నారు. మంగళవారం శాంతిపురంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళ మాన, ప్రాణాల రక్షణ లేకుండా పోతోందన్నారు. గొప్పగా చెబుతున్న దిశ చట్టం దశాదిశా లేకుండా పోయిందన్నారు. తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితపై మంత్రి అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపహరించుకుని క్షమాపణలు చెప్పాలని వారు డిమాండు చేశారు.

Updated Date - 2022-06-29T06:09:42+05:30 IST