టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతల దాడి
ABN , First Publish Date - 2022-08-08T04:57:20+05:30 IST
రాజుపాళెం మండలంలో ఐదుగురు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడిచేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు.
బద్వేలు రూరల్, ఆగస్టు 7: రాజుపాళెం మండలంలో ఐదుగురు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడిచేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సిద్దమూర్తి చంద్రశేఖర్రెడ్డి తన పొలంలో మొక్కలు నాటుతుండగా తమకూ హక్కు ఉందంటూ వైసీపీ నేత పోకల శ్రీనివాసుల రెడ్డి తన వర్గీయులతో కలిసి వాగ్వాదపడినట్లు బాధితులు తెలిపారు. వారి నడుమ మాటా మాట పెరిగి దాడికి దిగినట్లు ఆరోపించా రు. తమకు చెందిన పొలంలో వారికి హక్కు లేదని వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడి దాడి చేశారని బాధితులు వివరించారు.
దాడుల్లో చంద్రశేఖర్రెడ్డి, సుబ్బమ్మ, మీరారెడ్డి, గోపిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి గాయాల పాలయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రథమచికిత్స అనంతరం మెరగైన వైద్యం కోసం కడపకు తరలించారు. ఈ ఘటనపై పోకల శ్రీనివాసుల రెడ్డి, ఆయన వర్గీయులతో దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు విచారించి కేసు నమోదు చేస్తామన్నారు.