కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-02-23T20:09:39+05:30 IST

బేతంచెర్ల మండలం, ఆర్ఎస్ రంగాపురంలో వైసీపీ నాయకులు దౌర్జన్యానికి తెగబడ్డారు.

కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యం

కర్నూలు జిల్లా: బేతంచెర్ల మండలం, ఆర్ఎస్ రంగాపురంలో వైసీపీ నాయకులు దౌర్జన్యానికి తెగబడ్డారు. ఇంటి స్థలం వివాదంలో రామేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఇంట్లోఉన్న రామేశ్వర్ రెడ్డిని బయటకు తీసుకువచ్చి రోడ్డుపై దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని.. స్థలం ఇవ్వనందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తనపై అన్యాయంగా దాడి చేశారని బాధితుడు వాపోయారు. వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహానీ ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని రామేశ్వర్ రెడ్డి కోరుతున్నారు.

Updated Date - 2021-02-23T20:09:39+05:30 IST