చిరంజీవికి ఎందుకు నమస్కారం పెట్టలేదు?..పవన్ను ప్రశ్నించిన వైసీపీ నేత
ABN , First Publish Date - 2022-03-15T17:38:58+05:30 IST
సీఎం జగన్, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు.
విశాఖపట్నం: సీఎం జగన్, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన ఆవిర్భావ సభ కాదది...ఆవిరి అయ్యే పార్టీ సభ అని వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు బాటే... పవన్ మాట.. ప్యాకేజీ స్టార్ పవన్. పవన్కు నిజంగా సంస్కారం ఉంటే... మీ అన్నయ్య చిరంజీవికి ఎందుకు నమస్కారం పెట్టలేదు?’’ అని ప్రశ్నించారు. జగన్ ని ఒంటరిగా ఢీ కొట్టలేక పొత్తుల కోసం పవన్ తహతలాడుతున్నారని విమర్శించారు. పోటీ చేయడానికి విశాఖ కావాలి...కానీ రాజధాని వద్దా? అని నిలదీశారు. విశాఖలో చంద్రబాబుకు జరిగిన పరాభవమే పవన్కు జరుగుతుందని వైసీపీ నేత కొండా రాజీవ్ గాంధీ అన్నారు.