వైసీపీ నాయకుడు హబీబుర్‌ రహమాన్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-01T04:41:59+05:30 IST

పాలమూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు హబీబుర్‌ రహమాన్‌ గుండెపోటుతో శుక్రవారం మరణించారు.

వైసీపీ నాయకుడు హబీబుర్‌ రహమాన్‌ మృతి
రహమాన్‌(ఫైల్‌)

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 30: పాలమూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు హబీబుర్‌ రహమాన్‌ గుండెపోటుతో శుక్రవారం మరణించారు. పట్టణంలోని షాషాబ్‌గుట్టకు చెందిన ఈయన కుటుంబం చిన్నపుడే హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడే సెటిల్‌ అయ్యారు. 2014లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ టికెట్‌ రహమాన్‌కు ఖరారుకాగా చివరి నిమిషంలో మార్పు చేశారు. జిల్లాతో మంచి సంబ ంధాలున్నాయి. టీఆర్‌ఎస్‌, వైసీపీ అధినేతలతో సత్సం బంధాలు నెలకొల్పారు. మైనారిటీ నేతగా ఆ వర్గంలో మంచి పట్టున్న నాయకుడు. ఆయన మరణంతో పాలమూరులో ఉన్న అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. 

Updated Date - 2021-05-01T04:41:59+05:30 IST