వైసీపీలో పలువురు చేరిక

ABN , First Publish Date - 2020-10-02T09:04:35+05:30 IST

పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ బెల్లపుకొండ దొరబాబు, మండపేట మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు పోతుల రాంబాబులు గురువారం వైసీపీలో చేరారు.

వైసీపీలో  పలువురు చేరిక

మండపేట, అక్టోబరు 1: పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ బెల్లపుకొండ దొరబాబు, మండపేట మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు  పోతుల రాంబాబులు గురువారం వైసీపీలో చేరారు. పట్టణానికి చెందిన దొరబాబు,  ద్వారపూడికి చెందిన పోతులరాంబాబులు గతంలో టీడీపీ తరపున మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, జెడ్‌పీటీసీగా పనిచేశారు.


వారిరువురు రాజ్యసభ సభ్యుడు పిల్లిసుభాస్‌ చంద్రబోస్‌, అమలాపురం,రాజమహేంద్రవరం ఎంపీలు చింతా అనురాధ, మార్గానిభరత్‌రామ్‌, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి తోటత్రిమూర్తులు సమక్షంలో గురువారం మండపేట పట్టణంలో వున్న శెట్టిబలిజ కళ్యాణ మండపంలో ఇరువురు వారి అనుచరులతో పార్టీలో చేరారు. నేతలు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్యచౌదరి, రెడి ్డరాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తులా శ్రీరంగారావు, మండపేట పట్టణ వైసీపీ అధ్యక్షుడు ముమ్మిడివరపు బాపిరాజు,  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T09:04:35+05:30 IST