YCP banners: మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతామంటూ గుడివాడలో వైసీపీ బ్యానర్లు

ABN , First Publish Date - 2022-09-23T17:22:10+05:30 IST

తమ జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం అంటూ గుడివాడ, రెడ్డిపాలెంలో వైసీపీ నేతల బ్యానర్లు..

YCP banners: మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతామంటూ గుడివాడలో వైసీపీ బ్యానర్లు

కృష్ణాజిల్లా (Krishna Dist.): తమ జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం అంటూ గుడివాడ నియోజకవర్గ సరిహద్దు రెడ్డిపాలెంలో వైసీపీ (YCP) నేతల బ్యానర్లు (banners) వెలిసాయి. రాత్రికి రాత్రే ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర (Maha Padayatra) శుక్రవారం రెడ్డిపాలెం మీదుగా గుడివాడ నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో బ్యానర్లు వెలసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ‘మేము ఎవరి జోలికి వెళ్ళం.. మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నలుగుతాం’ అంటూ రెడ్డిపాలెం సెంటర్లో వైసీపీ యువదళం పేరిట బ్యానర్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-09-23T17:22:10+05:30 IST