వైసీపీ అరాచకాలను ఎండగట్టాలి

ABN , First Publish Date - 2022-08-20T06:04:22+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలను టీడీపీ కార్యకర్తలు ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీఎన్‌ విజయకుమార్‌ అన్నారు. శుక్రవారం మద్దిపాడులోని పార్టీ కార్యాలయంలో బాదుడే బాదుడు, ఓటరు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షుడు మండవ జయంత్‌బాబు అధ్యక్షత వహించారు.

వైసీపీ అరాచకాలను ఎండగట్టాలి
సమావేశంలో పాల్గొన్న విజయ్‌కుమార్‌, నాయకులు

- మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌

మద్దిపాడు, ఆగస్టు 19 వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలను టీడీపీ కార్యకర్తలు ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీఎన్‌ విజయకుమార్‌ అన్నారు. శుక్రవారం మద్దిపాడులోని పార్టీ కార్యాలయంలో బాదుడే బాదుడు, ఓటరు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షుడు మండవ జయంత్‌బాబు అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా బీఎన్‌ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు గ్రామగ్రామాన అప్రమత్తంగా ఉండి, వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. టీడీపీ కార్యకర్తలపైకి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైసీపీ నాయకులు మట్టి, ఇసుకను కూడా వదలకుండా అక్రమంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్టీ మండల అధ్యక్షుడు జయంత్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో కార్యకర్తలు ఐక్యంగా ఉండి  బాదుడే బాదుకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తూ వైసీపీ విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో నాగన్నపాలెం సర్పంచ్‌ కాకర్ల విజయకుమార్‌, వెల్లంపల్లి ఎంపీటీసీ దుర్గాభవాని, ఎం. రామలింగయ్య, రెబ్బవరపు ప్రభాకర్‌, వాసుబాబు, కడియాల రఘుబాబు, శేషయ్య, అనిల్‌, ఎం. శ్రీనివాసరావు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T06:04:22+05:30 IST