మహాప్రస్థానంలో జ్ఞానేంద్రప్రసాద్ అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-08-10T05:22:43+05:30 IST
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్రప్రసాద్ అంత్యక్రియలు వైకుంఠ మహాప్రస్థానంలో మంగళవారం నిర్వహించారు.
మియాపూర్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్రప్రసాద్ అంత్యక్రియలు వైకుంఠ మహాప్రస్థానంలో మంగళవారం నిర్వహించారు. ఆల్వినకాలనీ నుంచి అంతిమయాత్రకు ఆయన పార్థివ దేహాన్ని కు టుంబ సభ్యులు తీసుకువచ్చారు. కడసారిగా నివాళులు అర్పించేందుకు పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మహాప్రస్థానంలో కుటుంబ స భ్యులు, పార్టీ కార్యకర్తల కన్నీటి వీడ్కొలు మధ్య అంత్యక్రియలు జరిపించారు.
జ్ఞానేంద్రప్రసాద్ పార్థివదేహానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పపాటి శ్రీకాంత నివాళులుఅర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సానుభూతి తెలిపారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మాధవరం గోపాలరావు ఉన్నారు.