యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి స్వామి వారికి మొక్కులు చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టనుంది. కొండపైన అభివృద్ధి పనుల దృష్ట్యా వాహనాల అనుమతిని పోలీసులు నిరాకరించారు.