భారత్‌లో ‘ఎక్స్‌ఈ’ తొలి కేసు ?

ABN , First Publish Date - 2022-04-07T09:57:37+05:30 IST

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’కి సంబంధించిన తొలి కేసును గుర్తించామని ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) బుధ వారం ప్రకటించింది.

భారత్‌లో ‘ఎక్స్‌ఈ’ తొలి కేసు ?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’కి సంబంధించిన తొలి కేసును గుర్తించామని ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) బుధ వారం ప్రకటించింది. కప్పా వేరియంట్‌కు సంబంధించిన మరో కేసు కూడా బయటపడిందని వెల్లడించింది. ఈ ఇద్దరు రోగుల శాంపిళ్లతో పాటు ఒమై క్రాన్‌ బీఏ.2 వేరియంట్‌ సోకిన మరో 228 మంది నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ(జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) కోసం కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌(ఎన్‌ఐబీజీఎం)కు పంపిస్తామని బీఎంసీ కమిషనర్‌ సురేశ్‌ కాకాని తెలిపారు. ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ సోకిన బాధితురాలు 50 ఏళ్ల కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అని, ఆమె ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చారని చెప్పారు. ఆ రోజు జరిపిన పరీక్షలో కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చినా.. మార్చి న నిర్వహించిన పరీక్షలో కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు.

Updated Date - 2022-04-07T09:57:37+05:30 IST